శనివారం నుంచి హైదరాబాద్ లో మిస్ వరల్డ్ -2025 పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల్లో పాల్గొనే భామలు, న్యాయ నిర్ణేతలు, అతిథులు అంతా ఇప్పటికే నగరానికి చేరుకున్నారు. భారత్ - పాక్ ల మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ లో అందాలపోటీల్లో ఎలాంటి తప్పిదం జరగకుండా పటిష్ట ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో నగరంలో మిస్ వరల్డ్ పోటీలను రద్దు చేయాలని విశ్వహిందూ పరిషత్ శుక్రవారం డిమాండ్ చేసింది.