మహిళలే దేశానికి ఆదర్శమని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్లో వీహబ్ వుమెన్ యాక్సిలరేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలో కోటి మంది మహిళలు కోటీశ్వరులు కావాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. తెలంగాణ 1 ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి చేరుకోవాలంటే ఇది జరగాలన్నారు. ఈ నెల 21న ఇందిరా మహిళ స్టాళ్లను మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు సందర్శిస్తారని తెలిపారు.