జూబ్లీహిల్స్ లోని రిపబ్లిక్ టర్కీ కాన్సులేట్ జనరల్ వద్ద పోలీసులు భద్రత ఏర్పాట్లు చేశారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా పెంచి పోలీసులు ఆంక్షలు విధించారు. సరిహద్దులో పాకిస్తాన్ కు చెందిన 400 డ్రోన్లను భారత్ పేల్చి వేసింది. అయితే పాకిస్తాన్ కు ఈ డ్రోన్లను టర్కీ అందజేయడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే కాన్సులేట్ వద్ద ఆందోళనలు జరిగే అవకాశం ఉందని భావించిన అధికారులు చర్యలు చేపట్టారు.