పని ఇస్తానని నమ్మించి లైంగిక దాడి

78చూసినవారు
పని ఇస్తానని నమ్మించి లైంగిక దాడి
పల్నాడు జిల్లాకు చెందిన మహిళ తన భర్తతో కలిసి శ్రీకృష్ణా నగర్ లో ఉంటూ, కొన్ని కారణాల వలన భర్తతో విడాకులు తీసుకుంది. శశికిరణ్ రెడ్డితో ఆమెకు సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో తన పర్సనల్ విషయాలు చెప్పి పని కావాలని అడగగా, తనకి సినిమా ఆఫీస్ ఉందని, అక్కడికి రమ్మని అతడు చెప్పాడు. 27వ తారీకు మధుర నగర్ లోని తన రూమ్ కి వెళ్లగా బెదిరించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు అని ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్