కార్వాన్ డివిజన్ పరిధిలో కొనసాగుతున్న సీసీ రోడ్డు పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డివిజన్ కార్పొరేటర్ స్వామి యాదవ్ అధికారులకు సూచించారు. బుధవారం డివిజన్ పరిధిలోని మొఘల్ నగర్లో కొనసాగుతున్న సీసీ రోడ్డు పనులను స్థానిక నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. పనుల్లో తప్పకుండా నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు.