కార్వాన్: డివిజన్ పరిధిలో పర్యటించిన కార్పొరేటర్

72చూసినవారు
డివిజన్ సమస్యలను పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని కార్వాన్ డివిజన్ ఎంఐఎం కార్పొరేటర్ స్వామి యాదవ్ అన్నారు. శుక్రవారం అధికారులతో కలిసి కనకదుర్గ నగర్ కాలనీలో పర్యటించారు. స్థానికులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోడ్లు, డ్రైనేజీ లైన్ సమస్యలతో పాటు విద్యుత్ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు చెప్పారు. దశలవారీగా అన్ని సమస్యలను పరిష్కరిస్తామని కార్పొరేటర్ హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్