మెహిదీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మంగళవారం దాడులు నిర్వహించారు. టోలీచౌకి ప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా యూనివర్సిటీ నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న నలుగురు నిందితులు మాజిద్ హుస్సేన్, నాసిర్ ఖాన్, బాసిర్ రెహమాన్, రెహ్మాన్ సిద్ధిఖీని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి పలు యూనివర్సిటీలకు చెందిన 108 సర్టిఫికెట్లు, 4 మొబైల్ ఫోన్స్, రబ్బర్ స్టాంప్స్ స్వాధీనం చేసుకున్నారు.