సైబర్ మోసాలకు పాల్పడుతున్న మోసగాళ్ల భరతం పట్టేందుకు హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైం పోలీసులు ఏప్రిల్ నెలలో దేశంలోని 6 రాష్ట్రాల్లో స్పెషల్ ఆపరేషన్ ను నిర్వహించారు. ఈ ఆపరేషన్ తో సైబర్ క్రైం పోలీసులు 24 మందిని అరెస్ట్ చేశారు. వీరి చేతుల్లో మోసపోయిన బాధితులకు 1.49 కోట్లు తిరిగి వచ్చేలా చేశారు. ఈ 24 మంది నిందుతులు దేశవ్యాప్తంగా 313 కేసుల్లో మోసాలకు పాల్పడగా తెలంగాణలో 54 మందిని కొల్లగొట్టారని పోలీసులు దర్యాప్తులో ఆధారాలు సేకరించారు.