భారత్, పాకిస్తాన్ల మధ్య తాజాగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు కొత్త స్ట్రాటజీలతో ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం టీజీఎస్ఆర్టీసీ ఎండీ, వీసీ సజ్జనార్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు కొత్త దందాకు తెరలేపారని వీసీ సజ్జనార్ పేర్కొన్నారు. ఇలాంటి నకిలీ సందేశాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.