అసెంబ్లీలో వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టినందుకు సీఎం రేవంత్ రెడ్డికి మాదిగ ఇంటలెక్చువల్ ఫోరం కృతజ్ఞతలు తెలిపింది. గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో ఫోరం అధ్యక్షుడు ఆరేపల్లి రాజేందర్, ప్రొఫెసర్ కాసిం వెంకటేష్ తదితరులు మాట్లాడుతూ బిల్లును చట్టరూపం దాల్చే ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని, జీవో జారీ చేసి ఉద్యోగ నోటిఫికేషన్లకు అన్వయించేందుకు చర్యలు తీసుకోవాలని ఫోరం డిమాండ్ చేసింది.