గ్రేటర్ హైదరాబాద్ యాదవ సంఘం ఖైరతాబాద్ నియోజకవర్గ అధ్యక్షుడిగా మంగళారపు చౌదరి మల్లికార్జున్ యాదవ్ నియమితులయ్యారు. బుధవారం జాంబాగ్ లోని యాదవ సంఘం గ్రేటర్ హైదరాబాద్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు బోయిని వెంకటేష్ యాదవ్, ఛైర్మన్ చిట్టబోయిన నందకిషోర్ నియామక పత్రం అందజేశారు.