కూకట్ పల్లి నియోజకవర్గం 124 ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని జయశంకర్ కాలనీలో నివసించే అంజయ్య(62) అనారోగ్యంతో బాధపడుతూ మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తనయుడు, యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ బాధిత కుటుంబ సభ్యులను సోమవారం పరామర్శించి డీవీజీ ట్రస్ట్ ద్వారా 5,000/- రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది.