
భారత్కు వలసదారుల తరలింపు.. అమెరికాకు ఖర్చు ఎంతంటే..?
డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపారు. 104 మంది వలసదారులను భారత్కు పంపించేందుకు అమెరికా రూ.8.74 కోట్లకు (1 మిలియన్ డాలర్లు) పైనే ఖర్చు చేసినట్లు తెలిసింది. సాధారణంగా పౌర విమానాలతో పోలిస్తే సైనిక విమానాల నిర్వహణ ఖర్చు మూడు రెట్లు ఎక్కువగా ఉంటుంది. సీ-17 మిలిటరీ విమానం రవాణా నిర్వహణ వ్యయం గంటకు 28,562 డాలర్లు (దాదాపు రూ.24.98 లక్షల పైనే)గా ఉంది. ఈ విమానం భారత్ రావటానికి 43 గంటలు పట్టింది.