కూకట్ పల్లి జోన్ పరిధిలో గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 11, 484 మంది నుంచి చెక్కుల రూపంలో ఆస్తీ పన్ను వసూలు చేయగా అవి ఇప్పుడు బౌన్స్ కావడంతో అధికారులకు తలనొప్పిగా మారింది. మొదట చెక్కుల రూపంలో పన్ను వసూలు వద్దనుకున్నప్పటికి చివరికి అనుమతించారు. బౌన్స్ అయిన చెక్కులు ప్రస్తుతం అధికారులకు కొత్త సమస్యను తెచ్చి పెట్టాయని చెబుతున్నారు.