తెలంగాణ ప్రభుత్వం మంగళవారం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వడగాల్పులను ప్రభుత్వం విపత్తుగా ప్రకటించింది. అలాగే, వడదెబ్బతో మరణించిన వ్యక్తి కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. బాధిత కుటుంబాలకు రూ. 4 లక్షలు పరిహారం ఇవ్వాలని వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.