ఎమ్మెల్యేతో కలిసి అసదుద్దీన్ ఒవైసీ ప్రచారం

51చూసినవారు
సైదాబాద్ డివిజన్ పరిధిలో హైదరాబాద్ ఎంఐఎం ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ మలక్ పేట్ ఎమ్మెల్యే అబ్దుల్ బలాలతో కలిసి గురువారం ప్రచారం చేశారు. ఇంటింటికి తిరుగుతూ ఎంఐఎం అధ్వర్యంలో ఎంపీ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులపై అవగాహన కల్పించారు. భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మరోసారి గెలిపిస్తే ప్రజలకు మరింత సేవ చేస్తానని తెలిపారు. ప్రచారంలో ఎంఐఎం కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్