కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నేషనల్ హెరాల్డ్ పత్రిక అంశంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై బీజేపీ ప్రభుత్వం కక్ష పూరితంగా చార్జిషీట్ లో పేర్లు నమోదు చేయడాన్ని నిరసిస్తూ టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయం ముందు చేపట్టిన ధర్నాలో పలువురు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, రాజ్యసభ సభ్యులు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తదితరులు పాల్గొన్నారు.