అజాంపుర డివిజన్ పరిధి చౌరస్తా వద్ద కొనసాగుతున్న క్లాక్ టవర్ నిర్మాణ పనులను డివిజన్ ఎంఐఎం కార్పొరేటర్ షేక్ మొహియుద్దీన్ అబ్రహం బుధవారం పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సకాలంలో పనులు పూర్తి అయ్యేలా చూడాలని కార్పొరేటర్ సిబ్బందికి సూచించారు. డివిజన్ పరిధి పలు చౌరస్థల సుందరీకరణలో భాగంగా ఈ క్లాక్ టవర్ నిర్మాణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు.