రాష్ట్రంలో గ్రూపు -1 పరీక్షలు ఎంత మంది అభ్యర్థులు రాశారో రాష్ట్ర ప్రభుత్వం వెళ్లడించకపోవడం సిగ్గుచేటు అని దళిత మైనార్టీ స్టూడెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దుడపాక నరేష్ అన్నారు. ఈ సందర్భంగా గ్రూప్ -1 రాసిన అభ్యర్థుల లిస్టును బహిరంగంగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఓయూ ఆర్ట్స్ కాలేజి వద్ద నిరసన వ్యక్తం చేశారు.