హైదరాబాద్లోని గౌలిగూడ-తాడ్బండ్ వరకు ఏప్రిల్ 12వ తేదీన హనుమాన్ జయంతి సందర్భంగా ఘనంగా హనుమాన్ శోభాయాత్ర నిర్వహించనున్నారు. ఈ క్రమంలో శోభాయాత్ర జరిగే మార్గంలో పోలీసు శాఖ శనివారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించింది. లక్డీకాపూల్ నుంచి వాహనదారులు వీవీ స్టాచ్యూ, సోమాజిగూడ.. బేగంపేట్, ప్రకాశ్ నగర్, పారడైజ్ ఫ్లై ఓవర్ల మీదుగా సికింద్రాబాద్ స్టేషన్కు చేరుకోవాలని సలహా ఇచ్చింది.