కంటోన్మెంట్ ప్రాంతంలో నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్ లో నష్టపోతున్న మసీదులు, దర్గాల ప్రతినిధులతో గురువారం ఎమ్మెల్యే శ్రీగణేష్ సమావేశం అయ్యారు. అధికారులతో మాట్లాడి, ప్రార్థన స్థలాలకు ఎటువంటి నష్టం జరగకుండా చూస్తామని చెప్పారు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితులు తలెత్తితే, ప్రత్యామ్నాయంగా మరోచోట నూతనంగా నిర్మాణం చేయిస్తామని హామీ ఇచ్చారు. మసీదు నిర్వాహకులు పూర్తి మద్దతు ఇవ్వాలని కోరారు.