రాష్ట్ర ప్రధాన సమాచార కమిషన్ చైర్మన్ గా జీ. చంద్రశేఖర్ రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ సమక్షంలో సంబంధిత పత్రాలపై సంతకాలు చేసి బాధ్యతలను స్వీకరించారు. ఇటీవల పలువురు ఐఎస్ఐ ల బదిలీల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ గా చంద్రశేఖర్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు.