హైదరాబాద్ నేరేడుమెట్లో గ్యాంగ్ రేప్ సంచలనం సృష్టించింది. కాచిగూడ బాలికపై ఐదుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికను ట్రాప్ చేసి యువకులు నేరేడుమెట్ తీసుకెళ్లారు. బాలికకు గంజాయి తాగించి యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. లైంగికదాడి విషయాన్ని తల్లికి బాధితురాలు చెప్పింది. సోమవారం కాచిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి నేరేడుమెట్ పీఎస్ కు కేసును పోలీసులు బదిలీ చేశారు.