నిరుద్యోగ రహిత నియోజకవర్గాలుగా తీర్చిదిద్దడం తన లక్ష్యమని మల్కాజ్ గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. నిరుద్యోగ రహిత మల్కాజ్ గిరి పోస్టర్ ను శుక్రవారం తన నివాసంలో ఆవిష్కరించి మాట్లాడారు. 25 ఏళ్ల రాజకీయ జీవితంలో చూసిన సమస్య నిరుద్యోగ సమస్య అని అన్నారు. ప్రతి ఒక్కరూ చదువుకుంటున్నారు కానీ అందరికీ ఉద్యోగాలు రావడం లేదన్నారు. నెలకు వెయ్యి ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పని చేస్తానని అన్నారు.