నగరంలో విషాదం..

60చూసినవారు
నగరంలో విషాదం..
హబ్సిగూడలో గురువారం సాయంత్రం దారుణం జరిగింది. పెట్రోల్ బంక్ వద్ద లారీ ఢీకొని స్కూల్ విద్యార్థిని మృతి చెందింది. జూన్సన్ గ్రామర్ స్కూల్లో 6వ తరగతి చదువుతున్న కామేశ్వరి.. పాఠశాల నుంచి ఇంటికి వస్తున్న క్రమంలో లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాలికను ఆసుపత్రికి తరలించగా .. చికిత్స పొందుతూ మృతిచెందింది. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. ఓయూ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్