
ఉగ్రవాదాన్ని అంతర్జాతీయ సమస్యగా పరిగణించాలి: జైశంకర్
ఉగ్రవాదం అంశాన్ని ద్వైపాక్షిక పరిధిలో కాకుండా, అంతర్జాతీయ సమస్యగా పరిగణించాల్సిన అవసరం ఉందని భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్. జైశంకర్ పేర్కొన్నారు. బెల్జియం, లక్సెంబర్గ్లలోని ప్రవాస భారతీయులను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదంపై పోరాటంలో అన్ని దేశాలు కలిసికట్టుగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని, ఇది సమిష్టి బాధ్యతగా చూడాలని ఆయన అభిప్రాయపడ్డారు.