తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన సమరంలో అపూర్వమైన ఘట్టం దీక్షా దివస్ ఆమరణ నిరహార దీక్షకు నేటితో 15 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా శుక్రవారం గండి మైసమ్మలో దీక్షా దివస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బండారి లక్ష్మారెడ్డి, మల్లారెడ్డి, మాధవరం కృష్ణారావు, కేపి వివేకానంద, మర్రి రాజశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు తదితరులు పాల్గొన్నారు.