జవహర్ మున్సిపల్ పరిధిలోని బస్తి దావఖన మరియు ప్రైమరీ హెల్త్ సెంటర్ జిల్లా పరిషత్ పాఠశాలలను మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ గౌతమ్, మేయర్ శాంతి కోటేష్ గౌడ్ మంగళవారం ఉదయం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా బస్తి దావఖానలో అందిస్తున్నటువంటి వైద్యాన్ని ప్రత్యేకంగా డాక్టర్లను అడిగి వివరాలు తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారులు, స్థానిక కార్పొరేటర్లు, కమిషనర్ స్థానికులు పాల్గొన్నారు.