జీవరాశులకు ఆవాసంగా ఉన్న పురాతనమైన మర్రిచెట్టును నరికివేసిన వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని మేడ్చల్ జిల్లా అటవి అధికారి రేణుక స్పష్టం చేశారు. కాలనీవాసుల ఆందోళనతో శివసాయి నగర్లో నరికివేతకు గురైన మహావృక్షాన్ని శనివారం జిల్లా అటవి డిప్యూటీ రేంజర్ ఇంద్రసేనారెడ్డితో కలిసి ఆమె సందర్శించారు. సీసీఎస్ అధ్యక్షుడు ఎంపల్లి పద్మారెడ్డి పాల్గొన్నారు.