అభివృద్ధి పనుల్లో ప్రజల భాగస్వామ్యం అభినందనీయమని జవహర్నగర్ ప్రగతికి నిరంతరం కృషి చేస్తున్నామని మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ అన్నారు. జవహర్నగర్ కార్పొరేషన్ 5వ డివిజన్ జ్యోతిరావుపూలే కాలనీలో కాలనీవాసులు సొంత నిధులు, మాజీ డిప్యూటీ మేయర్ సహకారంతో శుక్రవారం రూ.10 లక్షలతో భూగర్భ డ్రైనేజీ పనులను ప్రారంభించారు.