అగోరి పేరు చెప్పుకొని ప్రజలను మోసం చేస్తున్న అగోరి అలియా శ్రీనివాస్ అలియాస్ శివ విష్ణు బ్రహ్మ అల్లూరిపై చర్యలు తీసుకోవాలని జోగిని సంధ్య గురువారం శామీర్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జోగిని సంధ్య మాట్లాడుతూ. సనాతన ధర్మం పేరు చెప్పుకొని ప్రజల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నాడని, హిజ్రాలకు చెడ్డ పేరు తెచ్చేలా ప్రవర్తిస్తున్నాడని ఆరోపించారు.