మేడ్చల్ నియోజకవర్గం శామీర్పేట్ లో మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ ను తన నివాసంలో బాచుపల్లి డబుల్ బెడ్ రూమ్ నివాసులు ఆదివారం కలిసి తమ గోడును చెప్పుకున్నారు. 10 బ్లాకుల్లో 1080 కుటుంబాలు నివసిస్తుండగా అందులో నీటివసతి లేదు, బోరు లేదు,
చుట్టూ కాంపౌండ్ వాల్ లేదు,
బస్తీ దవాఖాన లేవు అని ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. అనేక సమస్యలతో బాధపడుతున్న మా కాలనీకి ఒక సారి వచ్చి చూసి సమస్యలు పరిష్కరించాలని కోరారు.