టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తోంది. ప్రస్తుతం బోడుప్పల్ లోని అర్భిఎం ఆసుపత్రిలో వెంకట్ చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఫిష్ వెంకట్ కు సాయం చేయాలని ఆయన భార్య, కూతురు వేడుకుంటున్నారు. దీంతో ఫిషర్ మెన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ శనివారం హాస్పిటల్ కు వెళ్లి వెంకట్ కుటుంబ సభ్యులను కలిసి ఆర్థిక సాయం అందజేశారు వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరుస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.