మేడ్చల్: ఆపరేషన్ సిందూర్ విజయోత్సవ వేడుకలు
By sunitha 81చూసినవారుగుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని మల్లారెడ్డి మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో ఆపరేషన్ సిందూర్ విజయోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు కశ్మీర్కు వెళ్లిన పర్యాటకులను కాల్చి చంపడం దారుణమన్నారు. ఉగ్రమూకలపై జరిగిన దాడిలో కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండ్ వ్యోమికా సింగ్ నాయకత్వం వహించడం దేశానికే గర్వకారణమన్నారు.