నెల రోజుల నుంచి తాగునీళ్లు రావడం లేదని ఇందిరమ్మ కాలనీ వాసులు గురువారం ఖాళీ బిందెలతో రోడ్డెక్కారు. మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ మండలం లాల్ గడి మలక్ పేట్ గ్రామంలో గ్రామ పంచాయతీ ఎదుట నిరసన చేపట్టారు. నల్లా నీళ్లు రాకపోవడంతో ట్యాంకర్ల నీళ్లు కొనలేక పోతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు.