హైదరాబాద్: బోర్డర్‌లో ఉద్రిక్తత.. సైబర్ నేరగాళ్ల కొత్త దందా: సజ్జనార్

79చూసినవారు
హైదరాబాద్: బోర్డర్‌లో ఉద్రిక్తత.. సైబర్ నేరగాళ్ల కొత్త దందా: సజ్జనార్
భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల వేళ, సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేయడానికి కొత్త మార్గాలను వెతుకుతున్నారని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హెచ్చరించారు. ఆర్మీ అధికారుల పేరుతో మెసేజ్‌లు పంపిస్తూ, విరాళాల పేరుతో ప్రజల నుంచి డబ్బు వసూలు చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి నకిలీ సందేశాలపై అప్రమత్తంగా ఉండాలని, డొనేషన్ పేరుతో వచ్చే అభ్యర్థనలను నమ్మి డబ్బు చెల్లించవద్దని సూచించిస్తూ.. ఎక్స్‌ వేదికగా పోస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్