ఇటీవల బస్సు ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన బృందంతో కలిసి మంగళవారం ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉన్న బస్సు భవన్ను ముట్టడించే ప్రయత్నం చేశారు. బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయం నుంచి బస్సు భవన్ వద్దకి చేరుకున్నారు. ఈ క్రమంలో కవితను పోలీసులు అరెస్టు చేశారు.