నగరంలో ప్రసిద్ధిగాంచిన వివేక్నగర్ హనుమాన్ ఆలయంలో తొలి ఏకాదశి సందర్భంగా శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ శాసనసభ్యులు ముఠా గోపాల్ పాల్గొని దేవుడిని దర్శించుకున్నారు. డివిజన్ అధ్యక్షుడు రాకేష్ కుమార్, మీడియా ఇంచార్జ్ ముచ్చకుర్తి ప్రభాకర్, ఆకుల శ్రీనివాస్, పున్న సత్యనారాయణ, ముచ్చకుర్తి పద్మ, సంతోష్, శ్రీనివాస్ గుప్తా, వంశి, పోతుల శ్రీకాంత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.