ముషీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని భాగలింగంపల్లిలో స్కూల్ రీఓపెన్ చేద్దామని ప్రిన్సిపల్ వెళితే ఆ భవనం ఓనర్ అడ్డుతగిలారు. ముషీరాబాద్లోని మైనారిటీ గురుకుల బాలికల పాఠశాలలో ఈ ఘటన వెలుగుచూసింది. '13 నెలలుగా బిల్లు రాలేదని ఓనర్ అంటున్నారు. క్లాసులు ప్రారంభిద్దామని వస్తే గేటుకు తాళం వేశారు. ఎంత రిక్వెస్ట్ చేసినా వినలేదు. అధికారులు చొరవ తీసుకోవాలి. టీచర్లను రోడ్డు మీద నిలబెడితే పాఠాలు ఎలా చెప్పాలి. ' అంటూ ప్రిన్సిపల్ వాణిశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు.