
పేదల ఇళ్లకు శాశ్వత పట్టాలు: మంత్రి నారాయణ
AP: పేదలకు కూటమి ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. నెల్లూరు సిటీలో 1400 మంది పేదల ఇళ్లకు శాశ్వత పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పెన్నా నది తీరాన ఉన్న నివాసాలన్నింటికీ శాశ్వత ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. భగత్ సింగ్ కాలనీ వాసులకు ఇది పండుగ రోజు అని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పేదల పక్షాన ఉందని తెలిపారు.