ఇంద్ర పార్క్ ధర్నా చౌక్ లో ఫార్మా డి నిరుద్యోగుల ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు శీలం వెంటకేష్ మాట్లాడుతూ. ప్రభుత్వం ఫార్మా డి కోర్సు పట్ల ఎందుకు వివక్షత కనబరుస్తోంది. ఎంసెట్లో ఈ కోర్సు కు ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఉద్యోగం కల్పించని ఫార్మా డీ కోర్సు వల్ల ప్రయోజనం ఏమిటి, 12 ఏళ్లుగా క్లినికల్ ఫార్మసిస్టుకు నోటిఫికేషన్ ఎందుకు విడుదల చేయలేదు. 2021, 2025 సంవత్సరాల్లో వచ్చిన సవరణలను పూర్తిస్థాయిలో అమలు చేయాలి అని అన్నారు.