విద్యుత్ తీగలు తగిలి కార్మికుడు మృతి చెందిన సంఘటన దోమలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. హిమాయత్ నగర్ వీధి నెంబర్ 2 లో నివాసి రోహిత్ అగర్వాల్ అనే వ్యక్తి ప్లంబర్ పని కోసం తీసుకువచ్చిన మహ్మద్ ఇబ్రహీం ఖాన్ కు కరెంట్ షాక్ తగిలి మృతి చెందాడు. మొదటి అంతస్తు నుంచి ఇనుప పైపు ను తొలగించి భుజాన పెట్టుకుని కిందకు వస్తుండగా ప్రమాదం. రోహిత్ అగర్వాల్ ను అదుపులోకి తీసుకున్న దోమలగుడ పోలీసులు.