సీజీఎఫ్ రాష్ట్ర స్థాయి కమిటీ సమావేశం శుక్రవారం తెలంగాణ సచివాలయంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ నేతృత్వంలో జరిగింది. చిన్న దేవాలయాల అభివృద్ధికి నిధుల కేటాయింపులపై అధికారుల నివేదికను సమీక్షించిన మంత్రి సురేఖ, బడ్జెట్ అనుమతులు మరియు నిధుల వినియోగంపై సమగ్రంగా చర్చించారు. సమావేశంలో శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, డైరెక్టర్ వెంకట్ రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.