అమెరికా నుండి అక్రమంగా దిగుమతి చేసిన డ్రగ్స్తో పాటు స్కోడా కారు, విదేశీ మద్యం బాటిళ్లు ఎస్టీఎఫ్ బీ టీం ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాచిగూడ రైల్వే స్టేషన్ సమీపంలో ఓజీ కుష్, గంజాయి, చరస్, హషీష్ డ్రగ్స్ను మార్పిడి చేస్తున్న ప్రతిష్ బట్, జై సూర్యలను అరెస్ట్ చేశారు. డ్రగ్స్ విలువ రూ. 40 లక్షలు. జాయింట్ కమిషనర్ ఖురేషి ఈ వివరాలు బుధవారం మీడియాకు వెల్లడించారు.