బీఆర్ఎస్ నేతలపై శుక్రవారం హైదరాబాద్ గాంధీ భవన్లో ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వారి కాళ్లు కడుక్కోవడాన్ని తప్పుడు కోణంలో చూపిస్తూ, కేటీఆర్ దుష్ప్రచారం చేస్తున్నాడని ఆయన ఆరోపించారు. "బీఆర్ఎస్ నాయకులకు స్థితి, గతి, మతి పోయింది. కేటీఆర్కు ఎర్రగడ్డలో చికిత్స అవసరం, " అని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని అన్నారు.