బీజేపీ అధ్యక్షుడు రామచందర్రావు సీఎం రేవంత్రెడ్డికి బహిరంగ లేఖ రాయడంపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. మోదీ సర్కార్ ఫెయిల్యూర్స్ సంగతేంటని ప్రశ్నించారు. ‘మీ వైఫల్యాలు రాస్తే రామాయణమంత.. వింటే భారతమంత. గురువింద గింజ సామెతను గుర్తు చేసే విధంగా ఉన్న మీ లేఖ నవ్వు తెప్పిస్తోంది. తెలంగాణకు కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వనప్పుడు మీరు కానీ, 8 మంది బీజేపీ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఏం చేశారు?’ అని ప్రశ్నించారు.