హైదరాబాద్: జర్నలిస్టులందరికి ఇందిరమ్మ ఇళ్లు

68చూసినవారు
హైదరాబాద్: జర్నలిస్టులందరికి ఇందిరమ్మ ఇళ్లు
జర్నలిస్టులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని, ప్రెస్ అకాడమీని తిరిగి ఓపెన్ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నాంపల్లి లోని ప్రెస్ అకాడమీలో జర్నలిస్టు కుటుంబాలకు పెన్షన్, ఎక్స్ గ్రేషియాకు సంబంధించిన చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా విధినిర్వహణలో చనిపోయిన, అనారోగ్యం బారిన జర్నలిస్టు కుటుంబాలకు చెక్కులను అందజేశారు. అనంతరం మంత్రి పొంగులేటి మాట్లాడుతూ అర్హులైన జర్నలిస్టులందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం అందించే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పారు.

సంబంధిత పోస్ట్