బీజేపీ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమురయ్య, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డిలు కేంద్రమంత్రి, బీజేపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని గురువారం కలిశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి వారికి బీ-ఫార్మ్ అందజేశారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. భారీ మెజారిటీ కూడా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.