తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ అభివృద్ధిపై బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమగ్ర ప్రణాళికతో నగర పరిసర ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించినట్లు సమాచారం.