మంత్రులతో ముఖాముఖిలో భాగంగా బుధవారం హైదరాబాద్ నాంపల్లి గాంధీ భవన్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్బంగా పార్టీ శ్రేణులు, సామాన్య ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తూ, వారి సమస్యలను పరిశీలిస్తునారు. సంబంధిత శాఖ అధికారులతో ఫోన్లో మాట్లాడి తక్షణ ఆదేశాలు జారీ చేశారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తామని ఆమె తెలిపారు.